Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీస్ వంటకం ఛీజ్ మైదా టార్టిల్లాస్ తయారీ ఎలా?

Written By PNR
Updated: సోమవారం, 9 జూన్ 2014 (12:39 IST)
కావలసిన పదార్థాలు :
ఛీజ్... పావు కేజీ
ఉల్లిపాయలు... మూడు
టొమోటోలు... మూడు
క్యాప్సికం... రెండు
మైదా... 350 గ్రాములు
ఉప్పు... తగినంత
కొత్తిమీర... రెండు కట్టలు
 
తయారీ విధానం :
ముందుగా మైదాపిండిలో కాస్తంత ఉప్పువేసి నీటితో చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, టొమోటోలు, క్యాప్సికంలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కొత్తిమీరను కూడా తురిమి ఉంచాలి. ఫ్రెష్ ఛీజ్ అయినట్లయితే.. తొందరగా కరుగుతుంది, లేనట్లయితే దాన్ని సన్నగా తురిమి రెండు భాగాలుగా చేసి ఒక బాగాన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ కప్పులలో నింపాలి.
 
రెండో భాగాన్ని సీజనింగ్ కోసం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మైదాను నాలుగు భాగాలుగా చేసి మందంగా రొట్టెల్లాగా వత్తుకోవాలి. వాటిపైన ఉల్లిపాయ, టమోటో, క్యాప్సికం ముక్కలతో పాటు ఛీజ్ కూడా వేసి సన్నటి మంటపైన కాల్చాలి. అదే ఓవెన్లో అయితే, మూడు నిమిషాల పాటు తక్కువ ఉష్ణోగ్రత వద్ద బేక్ చేస్తే సరిపోతుంది.
 
తరువాత... కప్పులో నింపిన ఛీజ్‌లో కొత్తిమీరను చల్లి, ఇందాక ఉడికించుకున్న మందపాటి రొట్టెలతో సర్వ్ చేయాలి. అన్నట్టు ఛీజ్‌లో డిప్ చేసుకుని వీటిని తింటుంటే భలే రుచిగా ఉంటాయి సుమండీ... ఇంకేముంది వేడి వేడిగా వెరైటీగా ఉండే ఈ ఛీజ్ మైదా టార్టిల్లాస్‌ను ఓ పట్టు పట్టండి మరి..!
About Author
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

తెలంగాణాలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భర్త మెడకు కరెంట్ వైర్ బిగించి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య

నేపాల్ వరద ప్రళయం మృతులు 675 - 275 మంది భారతీయుల జాడ ఎక్కడ?

నేడు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష - మద్యం సేవించి పరీక్షకు వచ్చిన విద్యార్థి

నేపాల్‌కు మళ్లీ వరద హెచ్చరిక - అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

Show comments