Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొజ్జను తగ్గించాలంటే.. ఈ జ్యూస్‌ను తాగండి..

ముందుగా కీరదోసను శుభ్రం చేసుకుని.. తొక్కను తీసేసి మిక్సీలో రుబ్బుకోవాలి. అందులో నిమ్మరసాన్ని పిండుకోవాలి. పుదీనా తురుము, అల్లం తరుగు చేర్చుకుని తగినన్ని నీటితో జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. రోజూ ఉదయం పూ

Written By Selvi
Updated: సోమవారం, 21 ఆగస్టు 2017 (14:30 IST)
కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, పోషకాహారానికి దూరమవడం వంటి కారణాల చేత.. మూడు పదుల్లోనే ఆడామగా తేడా లేకుండా బొజ్జ పెరిగిపోతుంది. అలా మీకు కూడా బొజ్జ పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ జ్యూస్‌ను తాగండి అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. 
 
కడుపులో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం అంత సులభం కాదు. పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోతే.. దాన్ని కరిగించేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఇంకా ఈ జ్యూస్‌ను పరగడుపున తాగడం ద్వారా పొట్టను  తగ్గించుకోవచ్చు. 
 
పొట్టను తగ్గించే జ్యూస్ ఎలా చేయాలంటే?
కావలసిన పదార్థాలు : 
కీరదోస -1 
నిమ్మ కాయ - 1  
పుదీనా ఆకులు - అర కప్పు 
అల్లం తురుము - రెండు స్పూన్లు 
నీరు  -  తగినంత 
 
తయారీ విధానం: 
ముందుగా కీరదోసను శుభ్రం చేసుకుని.. తొక్కను తీసేసి మిక్సీలో రుబ్బుకోవాలి. అందులో నిమ్మరసాన్ని పిండుకోవాలి. పుదీనా తురుము, అల్లం తరుగు చేర్చుకుని తగినన్ని నీటితో జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. రోజూ ఉదయం పూట ఈరసాన్ని తాగితే మూడు నెలల్లోపు పొట్ట తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అదే విధంగా ఓ గ్లాసుడు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం, తేనె, రెండు వెల్లుల్లి రేకుల పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం పూట తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

అస్సాంలో పదవ తరగతి విద్యార్థిపై హత్యాచారం.. ఫంక్షన్‌కు వెళ్లిన తల్లి.. మంచంపై విగతజీవిగా..?

పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో సర్కారు విఫలం.. వైఎస్ జగన్

ప్రేమ పేరుతో మోసం చేశాడు.. నేను ఏడు నెలల గర్భిణి.. న్యాయం కావాలి (video)

ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న తెలంగాణ సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్.. ఆ వార్తల్లో నిజం లేదు..

అన్నీ చూడండి

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్

వారి వల్లే 'చెన్నై లవ్ స్టోరీ రూ. 50 కోట్ల గ్రాసర్ గా నిలిచింది - సాయి రాజేష్

హుషార్‌ పిట్టలు సెకండాఫ్‌లో నాలుగు సార్లు ఏడ్చాను : చరణ్‌ అర్జున్‌

అనకాపల్లి మూవీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా: సోనూ సూద్

Varun: సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ వినూత్నంగా చేయాలి : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments