Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త కరోనా కేసులు 19,412, మృతి చెందినవారు 61

Written By ఐవీఆర్
Updated: శనివారం, 1 మే 2021 (19:01 IST)
కరోనావైరస్ క్రమంగా చాప కింద నీరులా ఏపీలో విజృంభిస్తోంది. ఈరోజు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 19, 412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 61 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం 98,214 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. తొలిసారిగా రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షలు దాటేసింది. నిన్న ఒక్కరోజే 4,01,993 మందికి పాజిటివ్‌ తేలింది. మరోవైపు మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం 3,523 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,11,853కి చేరింది. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 30 లక్షలు దాటేసింది. ప్రస్తుతం 32,68,710 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 15,49,89,635 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు ప్రకటన విడుదల చేసింది.

అన్నీ చూడండి

Paradise teaser: పారడైజన్ జాగా కోసం నాని రక్తపాతం స్రుష్టించిన టీజర్ వచ్చేసింది

Korean Kanakaraju Review : రొటీన్ ఫార్మెట్ అయినా థ్రిల్ కలిగించే కథగా కొరియన్ కనకరాజు - రివ్యూ

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్

వారి వల్లే 'చెన్నై లవ్ స్టోరీ రూ. 50 కోట్ల గ్రాసర్ గా నిలిచింది - సాయి రాజేష్

హుషార్‌ పిట్టలు సెకండాఫ్‌లో నాలుగు సార్లు ఏడ్చాను : చరణ్‌ అర్జున్‌

తర్వాతి కథనం
Show comments