Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయంతో మేడపై నుంచి దూకేశాడు, ప్రాణాలు కోల్పోయాడు

Written By శ్రీ
Updated: శనివారం, 2 మే 2020 (20:53 IST)
కరోనా వైరస్ భయంతో మానసిక అందోళన చెందిన ఓ వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రామంతాపూర్‌లో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు విఎస్ అపార్టుమెంటులోని ప్లాట్ నెంబర్ ౩౦౩లో నివసించే వాసిరాజు కృష్ణ మూర్తి (60) కొద్ది కాలంగా గ్యాస్ సమస్యతో అవస్థ పడుతున్నాడు.
 
తరచూ ఆయాసం రావడంతో కరోనా సోకిందేమో అని ఆందోళన చెందాడు. దీనితో కుటుంబ సభ్యులు కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకువెళ్లగా కరోనా లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. 
 
అయినప్పటికీ ఆయన ఆందోళన చెందుతుండటంతో శనివారం గాంధీ అసుపత్రికి వెళదామని కుటుంబ సభ్యులు రెడీ అవుతున్న తరుణంలో అపార్టుమెంటు తన ప్లాట్ బాల్కనీ నుంచి కిందకు దూకడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో ఉప్పల్ పొలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రి మార్చురీకి తరలించారు.

అన్నీ చూడండి

Chiru 71st birthaday: చిరంజీవి బాస్ ఆఫ్ స్టైల్ అన్న మెహర్ రమేష్ - లివింగ్ లెజెండ్ అన్న థమన్

Suhas and Suri: మండాడి నుంచి సుహాస్ పోస్టర్, ఇంకోవైపు సూరి లవ్ ట్రాక్ విడుదల

Yash: ఓవర్ సీస్ లో భారీగా యశ్... టాక్సిక్ అమ్మకాలు - ఇంగ్లీష్ ట్రైలర్ విడుదల

షావుకారు జానకి తీవ్ర అస్వస్థత - వెంటిలేటర్‌పై చికిత్స!

Yami Gautam: చలాకి కోడలు గా యామీ గౌతమ్ చిత్రం నయ్యి నవెల్లి

తర్వాతి కథనం
Show comments