ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా ఉన్న కరోనా యాక్టివ్ కేసులెన్ని?

ఆదివారం, 22 నవంబరు 2020 (19:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 71,913 కరోనా టెస్టులు నిర్వహించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 164 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 21 కేసులు గుర్తించారు. 
 
అదేసమయంలో 11 మంది మరణించగా 1,631 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,62,213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,41,026 మంది కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 14,249 మంది చికిత్స పొందుతున్నారు. అటు, మొత్తం మరణాల సంఖ్య 6,938కి పెరిగింది.
 
మరోవైపు, జిల్లాల వారీగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 370, చిత్తూరు 769, ఈస్ట్ గోదావరి 4475, గుంటూరు 1608, కడప 273, కృష్ణ 1978, నెల్లూరు 973, ప్రకాశం 574, శ్రీకాకుళం 454, విశాఖపట్టణం 1253, విజయనగరం 194, వెస్ట్ గోదావరి 1149 చొప్పున కేసులు ఉండగా, మొత్తం 14249 యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఏపీలో ఉన్నాయి. 

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments