ఏపీలో కరోనా దూకుడు : కేసులు 1500 క్రాస్

గురువారం, 19 ఆగస్టు 2021 (19:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఫలితంగా గత రెండు రోజులుగా ఇక్కడ నమోదయ్యే పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుంది. తాజాగా వెల్లడైన బులిటెన్ మేరకు ఈ కేసుల సంఖ్య 1500 దాటాయి. గత 24 గంటల్లో 67,716 మంది శాంపిల్స్‌ని పరీక్షించగా 1,501 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 315 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి.
 
ఇదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,697 మంది కోలుకోగా... 10 మంది మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19,98,603కి పెరగగా... 19,69,169 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 13,696 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,738 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

అన్నీ చూడండి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

బ్రష్ చేస్తున్నా ఫ్లష్ చేస్తున్నా తెల్లపోరి మొఖమే తిరుగుతుంటది.. అంటూ దీవాన సాంగ్

Shraddha Das: విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ త్రికాల

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments