corona medicine: మరో ఔషధానికి అనుమతి

శనివారం, 8 మే 2021 (20:15 IST)
న్యూదిల్లీ: కరోనా బాధితులకు ఉపశమనం కలిగించేలా పలు ఔషధాలకు భారత ఔషధ నియంత్రణ  మండలి (డీసీజీఐ) త్వరగా అనుమతులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగానే అత్యవసర వినియోగానికి మరో ఔషధం అందుబాటులోకి రానుంది. డీఆర్‌డీవో లేబొరేటరీ ఇన్మాస్‌, రెడ్డి ల్యాబ్స్‌(హైదరాబాద్‌) సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
 
కరోనా చికిత్సకు అనుమతించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. స్వల్ప, మధ్యస్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి  ఇది బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. ఇది పౌడర్‌ రూపంలో లభించనుంది. 2-డీజీ ఔషధాన్ని నీళ్లలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ‘వైరస్‌ ఇన్‌ఫెక్ట్‌ అయిన సెల్స్‌తో పాటు, శరీరంలో వైరస్‌ వేగంగా వ్యాపించకుండా అడ్డుకుంటుంది’ అని డీఆర్‌డీవో వెల్లడించింది.

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments