ఇండోర్‌లో 31 మంది ఖాకీలకు కరోనా పాజిటివ్

గురువారం, 7 మే 2020 (17:28 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో కరోనా వైరస్ జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ వైరస్ దెబ్బకు ఇప్పటికే ఇండోర్ పట్టణం అతలాకుతలమైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా 31 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది.
 
ఈ విషయాన్ని ఇండోర్‌ (ఈస్ట్‌) ఎస్పీ మహ్మద్‌ యూసఫ్‌ ఖురేషీ తెలిపారు. వారిలో 22 మంది వేర్వేరు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని, మరో ఎనిమిది మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. 
 
మరోవైపు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3049 కరోనా కేసులు నమోదు కాగా 176 మంది చనిపోయారు. ఇకపోతే, దేశంలో మొత్తం 52952 మందికి ఈ వైరస్ సోకింది. 1783 మంది చనిపోగా, 15267 మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. 

అన్నీ చూడండి

కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో

Shruti Haasan: హెల్లాల్లో స్టెప్‌లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్

మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

తర్వాతి కథనం
Show comments