Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వ్యాధులు ఉంటే కరోనా ఈజీగా సోకేస్తుంది, అందుకే న్యూయార్క్‌లో అంతమంది...

Written By జె
Updated: శనివారం, 18 ఏప్రియల్ 2020 (22:06 IST)
కరోనా వైరస్ సోకకుండా ఉండాలని ఎంతోమంది అనుకుంటున్నారు. ముఖ్యంగా మాస్క్‌లు, గ్లౌజ్‌లు వేసుకుని జాగ్రత్తలు పాటిస్తుంటారు. కానీ గుండె వ్యాధిగ్రస్తులు, మధుమేహం, ఊపిరితిత్తులు, రక్తనాళాలకు మధ్య వాల్వ్ లాంటి సమస్యలు ఉంటే మాత్రం కరోనా వైరస్ ఈజీగా సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా జరగకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తూచా తప్పకుండా తీసుకోవాలంటున్నారు.
 
కోవిడ్-19 సోకిన వ్యక్తులలో 15 శాతం మందికి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని, వీరు వైరస్ నుంచి కోలుకున్నాక కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గుండె వ్యాధి గ్రస్తులు, మధుమేహం లాంటివి ఉంటే మాత్రం రోగ నిరోధక శక్తి శరీరంలో తక్కువగా ఉంటుందని.. దీంతో వైరస్ సోకే ప్రభావం ఉందంటున్నారు. 
 
ఒకవేళ వైరస్ సోకితే మాత్రం తట్టుకునే సామర్థ్యం అస్సలు ఉండదంటున్నారు. కాబట్టి పొగతాగడం పూర్తిగా మానెయ్యాలని సూచిస్తున్నారు. అలాగే ఖాళీ దొరికింది కదా అని మద్యం తాగడం కూడా చేయకూడదని.. అది మరింత ప్రమాదకరమంటున్నారు. న్యూయార్క్ వంటి దేశాల్లో ఇలాంటి వ్యాధులు ఉన్న వారు ఎక్కువగా ఉండడం వల్ల అధికంగా మరణాలు చోటుచేసుకున్నాయని హృద్రోగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

అన్నీ చూడండి

Mahakali update,: మహాకాళి అప్ డేట్ : ఆకట్టుకునేలా మహాకాళి గ్లింప్స్ - జనవరి 8న సిద్ధం

యశ్ 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి - మల్లారెడ్డి వర్శిటీపై కేసు

దుష్ప్రచారం చేస్తే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా : గోవిందా హెచ్చరికలు

బాలీవుడ్ హీరోహీరోయిన్ల మధ్య వయసు అంతరం : మనీషా కోయిరాలా

మూడోసారి గర్భమా? అది ప్రెగ్నెన్సీ కాదు.. పిజ్జా తినడం వల్లే...

తర్వాతి కథనం
Show comments