శ్రీహరికోట షార్ కేంద్రంలో కరోనా కలకలం : 12 మంది ఉద్యోగులకు పాజిటివ్

మంగళవారం, 4 జనవరి 2022 (10:55 IST)
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఏకంగా 12 మంది ఉద్యోగులతో పాటు ఇద్దరు వైద్యులకు ఈ వైరస్ సోకినట్టు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వెల్లడైంది. వీరందరి శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం బెంగుళూరులోని పరిశోధనాశాలకు పంపించారు. 
 
ఒకేసారి ఏకంగా 14 మందికి కరోనా సోకడంతో అంతరిక్ష కేంద్రంలో పని చేస్తున్న మిగిలిన ఉద్యోగులకు కూడా కోవిడ్ పరీక్షలను వైద్య శాఖ నిర్వహిస్తుంది. అలాగే, స్పేస్ సెంటరులో కరోనా వైరస్ కలకలం చెలరేగడంతో ప్రత్యేక మార్గదర్శకాలను కూడా షార్ అధికారులు జారీచేశారు. 
 
బయోమెట్రిక్ అటెండెన్స్ స్థానంలో హాజరుపట్టీలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యులకు ఈ వైరస్ సోకడంతో ఈ నెలాఖరులో నిర్వహించతలపెట్టిన రీశాట్ శాటిలైట్ ప్రయోగాన్ని వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదు.

అన్నీ చూడండి

Kajal Aggarwal: విడుదలకు ముందే చర్చకు తావిస్తున్న ది ఇండియా స్టోరీ

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

తర్వాతి కథనం
Show comments