శ్రీహరికోట షార్ కేంద్రంలో కరోనా కలకలం : 12 మంది ఉద్యోగులకు పాజిటివ్

మంగళవారం, 4 జనవరి 2022 (10:55 IST)
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఏకంగా 12 మంది ఉద్యోగులతో పాటు ఇద్దరు వైద్యులకు ఈ వైరస్ సోకినట్టు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వెల్లడైంది. వీరందరి శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం బెంగుళూరులోని పరిశోధనాశాలకు పంపించారు. 
 
ఒకేసారి ఏకంగా 14 మందికి కరోనా సోకడంతో అంతరిక్ష కేంద్రంలో పని చేస్తున్న మిగిలిన ఉద్యోగులకు కూడా కోవిడ్ పరీక్షలను వైద్య శాఖ నిర్వహిస్తుంది. అలాగే, స్పేస్ సెంటరులో కరోనా వైరస్ కలకలం చెలరేగడంతో ప్రత్యేక మార్గదర్శకాలను కూడా షార్ అధికారులు జారీచేశారు. 
 
బయోమెట్రిక్ అటెండెన్స్ స్థానంలో హాజరుపట్టీలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యులకు ఈ వైరస్ సోకడంతో ఈ నెలాఖరులో నిర్వహించతలపెట్టిన రీశాట్ శాటిలైట్ ప్రయోగాన్ని వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదు.

అన్నీ చూడండి

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments