దేశంలో కరోనా వ్యాప్తి.. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు..

మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (13:34 IST)
భారత్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా వరుసగా నాలుగో రోజు మూడు వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు రోజులతో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. 
 
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,64,740 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,038 కొత్త కేసులు బయటపడ్డాయి. 
 
గత 24 గంటల వ్యవధిలో ఢిల్లీ, పంజాబ్‌, కేరళలో ఇద్దరు చొప్పున, జమ్మూ కశ్మీర్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. 
 
అలాగే ఏపీలో కొత్త ఏడు కేసులు నమోదవగా, మొత్తం 104 కేసులు నమోదైనాయి. తెలంగాణలోనూ 20 కేసులు తాజాగా నమోదు కాగా, మొత్తం కేసులు 143కి చేరింది. 

అన్నీ చూడండి

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments