ఏపీలో తగ్గుతున్న కరోనావైరస్ కేసులు

Written By ఎం
Updated: శనివారం, 29 మే 2021 (17:14 IST)
ఏపీలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25% నుండి 17% కు తగ్గింది.  నమూనా పరీక్షలు 79564 చేస్తే వాటిలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 13756 గా తేలింది. కరోనా పాజిటివ్ రేట్  17%. మరణాలు  104 మంది. మరణాల రేటు ఇంకా తగ్గలేదు.
 
 అధిక మరణాలు  పశ్చిమగోదావరి 20 చేసుకున్నాయి. అత్యధిక కేసులు చిత్తూర్ 2155, తూర్పు గోదావరి  2301, మిగిలిన జిల్లాలలో కాస్త అదుపులోకి వచ్చాయి. కరోనా యాక్టివ్ కేసులు 173622 వుండగా కరోనా మృతులు ఇప్పటివరకు 10738  (0.64%).  రికవరీ 16.71లక్షలలో 14.87 లక్షల మంది రికవర్ అయ్యారు. (89%) 
 
రికవరీ శాతం కూడా కొద్దిగా పెరిగింది. సుమారు 1.73 లక్షల  పాజిటివ్ కేసులు, ఇంకా పరిక్షించాల్సిన లక్షలమంది మన చుట్టూ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లినా తప్పక మాస్కులు ధరించండి భౌతిక దూరం పాటించండి.. జాగ్రత్త గా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవాలి.  లేదంటే కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలవుతుంది. మనందరి జాగ్రత్త వలన ఇప్పుడిప్పుడే Covid  తగ్గుముఖం పడుతోంది. కొంత కాలం ఇలాగే జాగ్రత్తగా ఉంటే కరోనా పైన విజయం మనదే అవుతుంది

అన్నీ చూడండి

గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం

పౌరసత్వాన్ని వదులుకుంటానంటున్న అఖిల్ అక్కినేని

కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments