Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను పారదోలేందుకు ఈ చిట్కాలు పాటిస్తే...

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 28 ఆగస్టు 2020 (19:57 IST)
కరోనా వైరస్ ముఖ్య లక్షణం వాయునాళాల దగ్గర రక్తం గడ్డలా మారి ఉఛ్వాస, నిచ్చాస్వాలకి అడ్డుగా ఉండడం వలన శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గి ప్రధాన అవయవాలు దెబ్బతింటున్నాయి.
 
కరోనా వైరస్ మూలంగా వాయునాళాలలో రక్తంగడ్డ కట్టడం వలన శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపించడం ఊపిరి అందక మరణం సంభవిస్తున్నది.
 
ఏ ఆహారం తీసుకున్నా వేడి వేడిగా తినండి. వేడి నీరు మాత్రమే తాగండి.
 
తులసి ఆకులు రాత్రి పూట నానబెట్టి ఉదయం తాగడం వలన శ్వాస నాళాలు శుభ్రపడతాయి.
 
 
పసుపు ఉడక బెట్టినది కాదు ఎండబెట్టిన కొమ్ముల పొడి నీటిలో మరిగించి ఉప్పు వేసి గోరు వెచ్చని నీటితో గొంతుకు వరకూ ఉంచి గరాగరా లాడించి ఊయడం.
 
 
పసుపు వేసి నీటిని మరిగించి ఆవిరి రోజుకు 4సార్లు పట్టడం వలన వాయునాళాల మధ్యలో గడ్డలుగా కట్టే రక్తన్ని కరిగించి శ్వాసని సులభంగా తీసుకునేలా చేస్తుంది.
 
వేడి నీటిలో నిమ్మరసం తేనె కలిపి తీసుకోవడం. ఉసిరికాయ పొడిని కొద్దిగా గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగడం. మిరియాల పాలను తీసుకోవడం.
 
అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు (మింగగలిగే వేడి ఉన్నప్పుడు) పొడి అన్నం 3 బాగా చిన్నచిన్న ముద్దలుగా చేసి ఉదయం సాయంత్రం మింగితే కఫంలా ఉన్న తెమడ క్రిందకు పోతుంది. శ్వాస సాఫీగా ఉంటుంది.
 
అల్లంతో మరిగించిన నీటిని చిన్న టీ కప్పు తాగడం. మజ్జిగలో శొంఠి పొడిని కలుపుకుని తాగడం, ఇది చిన్నపిల్లలకు వద్దు.
 

అన్నీ చూడండి

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

రవీనా టాండన్ ను ఆదర్శంగా తీసుకోవాలంటున్న వెంకీ అట్లూరి

చైనా పీస్ కు యా/ఏ సర్టిఫికెట్‌, సెప్టెంబర్‌లో రిలీజ్

Varun Tej : ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉండే ఛాలెంజింగ్ ఫాత్ర పోషించా : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments