దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (14:00 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారంతో పోల్చుకుంటే ఆదివారం నమోదైన కేసుల తక్కువగా ఉంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 10,112 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 64,806 క్రియాశీలక కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. శనివారం రోజున మొత్తం 12,193 కేసులు నమోదైన విషయం తెల్సిందే.
 
ఇక గడిచిన 24 గంటల్లో 29 మంది చనిపోయారు. వీరిలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఏడుగురు చనిపోయారు. తాజా మరణాలతో దేశంలో మొత్తం కరోనా కరోనా మరణాల సంఖ్య 5,31,329కు చేరింది. కరోనా వ్యాప్తి తీవ్రతను సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

అన్నీ చూడండి

పట్టభద్రులైన విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్

Prabhas: ప్రభాస్ లాంచ్ చేసిన వరుణ్ తేజ... కొరియన్ కనకరాజు టీజర్‌

Jani Master: మా మధ్య గొడవలు లేవు, డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి 18 లక్షలు విరాళం : జానీ మాస్టర్

Bhagyashri: రాజమౌళి గారి దర్శకత్వంలో రాణి లా నటించాలని కోరిక : భాగ్యశ్రీ బోర్సే

SS Karthikeya: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి జానర్‌లో సినిమా రాలేదు :ఎస్ఎస్ కార్తికేయ

తర్వాతి కథనం
Show comments