ముక్కోటి ఏకాదశి.. ఉప్పల్ కార్పొరేటర్ దంపతులకు కరోనా పాజిటివ్..

శనివారం, 26 డిశెంబరు 2020 (10:07 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడి కోలుకున్నారు. తాజాగా ఉప్పల్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ మందుముళ్ల రజితా పరమేశ్వర్‌రెడ్డి దంపతులు కరోనా బారినపడ్డారు. 
 
దంపతులిద్దరికీ కరోనా సోకినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని శుక్రవారం నిర్ధారణ అయినట్లు తెలిపారు. 
 
శుక్రవారం మధ్యాహ్నం నుంచి అన్ని రకాల కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అవుతున్నట్లు కార్పొరేటర్‌ దంపతులు ప్రకటించారు. వివిధ కార్యక్రమాల్లో తమతోపాటు పాల్గొన్న వారు కరోనా పరీక్షలు చేయించుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించారు. 
 
శుక్రవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని కార్పొరేటర్‌ దంపతులు ఉప్పల్‌లోని కరిగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం, ఉప్పల్‌ రామాలయం, రామంతాపూర్‌లో సత్యనారాయణస్వామి ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments