తెలంగాణలో కరోనా.. 24 గంటల్లో 612 కేసులు

శుక్రవారం, 11 డిశెంబరు 2020 (09:49 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక రోజు కేసులు తగ్గుతూ ఉంటే మరొక రోజు కాస్త పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 612 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,76,516 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,485 మంది మృతి చెందారు. తాజాగా 502 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,67,427 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,604 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 5,511 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 96.71శాతం ఉండగా, దేశంలో 94.8శాతం ఉంది. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 144 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments