తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. ఒక్క రోజే 502 కేసులు..

మంగళవారం, 1 డిశెంబరు 2020 (10:44 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వెయ్యికంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,318కి చేరింది.
 
ఇందులో 2,69,230 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,627 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక తెలంగాణలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1461కి చేరింది. నిన్న ఒక్కరోజు 894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 805 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) మరణించారు. 
 
ఇదిలావుంటే.. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 46,597 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 30వ తేదీ వరకు మొత్తం 55,00,058 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

అన్నీ చూడండి

Narne Nithin :నార్నే నితిన్, అనికా సురేంద్రన్, మేఘా శెట్టి కాంబినేషన్ లో చిత్రం

Akhil: లెనిన్ కథకు అఖిల్ సూట్ అవుతాడా? అని భయపడ్డాను, కానీ చూశాక హిట్ నమ్మకం కలిగింది : నాగార్జున

మరోమారు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్

కళ్యాణ్ రామ్ బర్త్‌ : సర్‌ప్రైజ్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

రుక్మిణీ వసంత్ అదుర్స్.. ఇదే అసలు గోట్ పర్మార్మెన్.. వీడియో వైరల్ (Video)

తర్వాతి కథనం
Show comments