తెలంగాణలో కోవిడ్ అప్‌డేట్.. 565 కేసులు.. ఒకరి మృతి

బుధవారం, 2 డిశెంబరు 2020 (13:23 IST)
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 565 కరోనా కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,70,833కు చేరింది. 1,462 మంది మరణించారు. 
 
ప్రస్తుతం తెలంగాణలో 9,266 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,60,155 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 106, రంగారెడ్డి జిల్లాలో 43 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
ఇప్పటి వరకు రాష్ట్రం వ్యాప్తంగా కోవిడ్‌తో మృతి చెందినవారి మొత్తం సంఖ్య 1462కు చేరింది. తెలంగాణలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,266గా ఉంది. గృహ, సంస్థల ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితుల సంఖ్య 7,219గా ఉంది 

అన్నీ చూడండి

కల్కి 2లో నటించనున్న సాయిపల్లవి?

director Ashok :భాగమతి దర్శకుడు అశోక్ పై కేసు నమోదు ?

Varun Tej : వరుణ్ తేజ్ చిత్రం కొరియన్ కనకరాజు డేట్ ఫిక్స్

రామ్ పోతినేని RAPO23 చిత్రానికి సామ్ సిఎస్ మ్యూజిక్

శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో మిస్టర్ మిడిల్ క్లాస్

తర్వాతి కథనం
Show comments