తెలంగాణలో కోవిడ్ అప్‌డేట్.. 565 కేసులు.. ఒకరి మృతి

బుధవారం, 2 డిశెంబరు 2020 (13:23 IST)
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 565 కరోనా కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,70,833కు చేరింది. 1,462 మంది మరణించారు. 
 
ప్రస్తుతం తెలంగాణలో 9,266 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,60,155 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 106, రంగారెడ్డి జిల్లాలో 43 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
ఇప్పటి వరకు రాష్ట్రం వ్యాప్తంగా కోవిడ్‌తో మృతి చెందినవారి మొత్తం సంఖ్య 1462కు చేరింది. తెలంగాణలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,266గా ఉంది. గృహ, సంస్థల ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితుల సంఖ్య 7,219గా ఉంది 

అన్నీ చూడండి

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

బ్రష్ చేస్తున్నా ఫ్లష్ చేస్తున్నా తెల్లపోరి మొఖమే తిరుగుతుంటది.. అంటూ దీవాన సాంగ్

Shraddha Das: విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ త్రికాల

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

తర్వాతి కథనం
Show comments