దేశంలో కొత్తగా 16135 కరోనా పాజిటివ్ కేసులు

సోమవారం, 4 జులై 2022 (11:02 IST)
దేశంలో కొత్తగా మరో 16 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 3.32 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా ఇందులో 16135 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఆదివారం కూడా ఇదే స్థాయిలో కొత్త కేసులు నమోదైన విషయం తెల్సిందే. 
 
ఈ కొత్త కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు 4.85 శాతానికి చేరింది. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారని సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
కొత్త కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం మొత్తం క్రియాశీల కేసులు 1,13,864కి చేరాయి. క్రియాశీల రేటు 0.26 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.53 శాతానికి పడిపోయింది. ఆదివారం 13,958 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తంగా 5.25 లక్షల మందికిపైగా మరణించారు. 

అన్నీ చూడండి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments