దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ పాజిటివ్ కేసులు

శుక్రవారం, 8 జులై 2022 (11:17 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 3.79 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 18815 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి పాజిటివిటీ రేటు ఏకంగా 4.96 శాతానికి పెరిగింది. 
 
అలాగే, కేసుల సంఖ్య కూడా పెరిగింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ కనిపిస్తోంది. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి కరోనా సోకిందని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ప్రస్తుతవ్యాప్తి కారణంగా క్రియాశీల కేసులు 1,22,335కి చేరాయి. మొత్తం కేసుల్లో వాటి వాటా 0.27 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.52 శాతానికి పడిపోయింది. 24 గంటల వ్యవధిలో 15,899 మంది కోలుకోగా.. 38 మంది మరణించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

అన్నీ చూడండి

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పళ్ళబురుసు చిత్రం ప్రకటన

Dixith Shetty :దీక్షిత్ శెట్టి, శశి ఓదెల చిత్రానికి #KJQ (కింగ్ జాకీ క్వీన్) పేరు ఖరారు

Fauji Poster Controversy: ఫౌజీ రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ కాలి వేళ్లపై అభిమానుల్లో రచ్చ ?

Samantha: చిత్తూరులో సమంతకు సీమంతం

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత శరత్‌చంద్ర నాయుడు

తర్వాతి కథనం
Show comments