దేశంలో కొత్తగా 27 వేల పాజిటివ్ కేసులు

బుధవారం, 15 సెప్టెంబరు 2021 (10:26 IST)
దేశంలో కొత్తగా మరో 27176 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,33,16,755కి చేరింది. 
 
అలాగే, దేశంలో 38,012 మంది కోలుకున్నార‌ని తెలిపింది. దేశంలో క‌రోనాతో మ‌రో 284 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,43,497కి పెరిగింది.  
 
ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,25,22,171 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,51,087మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 61,15,690 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. 
 
దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 75,89,12,277 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దేశంలోనే అత్య‌ధికంగా కేరళలో 15,876 కొత్త‌ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 129 మంది మృతి చెందారు.

అన్నీ చూడండి

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

Kiran Abbavaram: ఒడిదొడుకులు చూశా. ఇలాంటి మంచి సినిమాల కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నా: కిరణ్ అబ్బవరం

Thalapathy: ముగిసిన దళపతి విజయ్ జ‌న నాయ‌గ‌న్‌ నిరీక్ష‌ణ‌.. జూలై 23న గ్రాండ్ రిలీజ్

నాగవంశీ ఆవిష్కరించిన అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ సాంగ్

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

తర్వాతి కథనం
Show comments