త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అరవింద్‌లకు కరోనా పాజిటివ్??

ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (09:52 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది సెలెబ్రిటీలు వరుసగా కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే అనేకమంది సెలెబ్రిటీలు ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఇద్దరు సెలెబ్రిటీలు ఈ వైరస్ బారినపడినట్టు వార్తలు వస్తున్నాయి. వారు ఎవరో కాదు.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఉన్నారు.
 
ప్రస్తుతం వీరు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అయితే దీనిపై వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. ఇప్పటికే ఈ నెల 9న విడుదల కావాల్సిన 'వకీల్‌సాబ్‌' చిత్రంలో కీలక పాత్రను పోషించిన హీరోయిన్‌ నివేదా థామస్‌కు కరోనా సోకిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరించింది కూడా. ఈ కారణంగా నివేదా థామస్‌ 'వకీల్‌ సాబ్‌' ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments