కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలని వేలాది మహామంత్రాలతో పండితులు

Written By జె
Updated: శుక్రవారం, 8 మే 2020 (22:18 IST)
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి మన నుండి వెళ్ళిపోవాలంటూ తిరుమలలో నిరంతరాయంగా యోగ వాశిష్టం.. ధన్వంతరి మహామంత్రం పారాయణం జరుగుతోంది. ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభమైన ఈ పారాయణం నేటితో ముగిసింది. ప్రతిరోజు వేదపండితులు, గాయకులు పారాయణాన్ని నాదనీరాజనం వేదికపై పఠించారు.
 
సాక్షాత్తు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం ముందు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో నాదనీరాజన మండపంలో పారాయణం జరిగింది. ముగింపు కార్యక్రమానికి తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ఎ.విధర్మారెడ్డి పాల్గొన్నారు. కరోనా వ్యాధి అరికట్టాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ వేదమంత్రాలను పఠించి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చునని చెప్పారు. 
 
మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ధన్వంతరి స్వామిని ప్రార్థిస్తూ ధన్వంతరి మహామంత్రం, మాంగళ్ళ వృద్థిని కోరుతూ లక్ష్మీదేవి మంత్ర పారాయణం, నవగ్రహ ప్రార్థన చేశామన్నారు. ఆ స్వామి వారి కృపా కటాక్షాలు మనపై ఎప్పుడూఐ ఉంటుందన్నారు తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి. 

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments