Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెటీగల దాడితో ఆగిన క్రికెట్ మ్యాచ్... పరుగులు పెట్టిన రాహుల్ ద్రవిడ్...

Written By మోహన్
Updated: బుధవారం, 30 జనవరి 2019 (17:43 IST)
క్రికెట్ మ్యాచ్ మధ్యలో అనేకసార్లు అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కొన్ని వినోదాన్ని పంచుతాయి, మరికొన్ని కాస్తంత కోపాన్ని తెప్పిస్తాయి. అయితే తేనెటీగల దాడి జరగడం అంటే ఓ వైపు తమాషాగా ఉన్నా మరోవైపు ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడతాయి. అలాంటి ఘటనే ఈ రోజు చోటుచేసుకుంది. 
 
భారత్ ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ మైదానంలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆకస్మాత్తుగా తేనెటీగలు ప్రేక్షకులపై దాడి చేసాయి. దీంతో అభిమానులు ఒక్కసారిగా మైదానం బయటకు పరుగులు తీసారు. తేనెటీగల నుండి తమను తాము రక్షించుకోవడానికి చొక్కాలు విప్పి గాలిలో ఊపుతూ మరీ పరిగెత్తారు. 
 
మ్యాచ్‌లో 28వ ఓవర్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. తేనెటీగల దాడిలో ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదని, మైదానంలోకి అవి రాలేదని అధికారులు తెలిపారు. అయితే గ్యాలరీలోని ప్రేక్షకులపై మాత్రం దాడి చేసాయన్నారు. దాడి సమయంలో భారత్- ఏ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అక్కడే ఉన్నాడని, అయితే వాటి నుండి తప్పించుకోవడానికి పరుగు తీసాడని చెప్పారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కి తరలించినట్లు స్పష్టం చేసారు.

అన్నీ చూడండి

పంటపొలంలో రూ.5లక్షలను పాలిథిన్ సంచిలో వుంచి పాతిపెట్టిన రైతు... చివరికి? (Video)

శ్రీ చైతన్య హైస్కూల్ హాస్టల్‌లో ర్యాంగింగ్.. కర్రలు, ప్లేట్లు, బూట్లతో విద్యార్థిపై దాడి

Chennai: పోర్షే కారును ఢీకొన్న క్యాబ్- ఏఆర్ రెహ్మాన్ కుమారుడికి స్వల్ప గాయాలు

విశాఖపట్నం, విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ పట్టాలెక్కిన మెట్రో పనులు

హైదరాబాదులో హిట్ అండ్ రన్ కేసు.. రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి

అన్నీ చూడండి

Tabu: ఇన్ కమ్ డాక్స్ డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డేగా టబు

Allu Arjun : విశాఖపట్నంలో సరికొత్త ఐకానిక్ AAA Cinemasbను ప్రారంభించిన అల్లు అర్జున్

Kiran Abbavaram : బాలీవుడ్ నిర్మాతలతో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం ఇంద్రపుత్ర

Ajay Bhupathi: ఆ సినిమాతో కిందపడ్డా మళ్ళీ నచ్చే సినిమాతో పైకి లేస్తా : అజయ్ భూపతి

Hansika: అతీంద్రియ పోలీస్ మిస్టరీ గా కపాలి నుంచి హన్సిక మోత్వాని లుక్

తర్వాతి కథనం
Show comments