ఐపీఎల్ 2025 : చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ హైలెట్స్

ఠాగూర్
సోమవారం, 31 మార్చి 2025 (12:09 IST)
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా, ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో నితీశ్ రాణా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 
 
గత రెండు మ్యాచ్‌లలో తక్కువ స్కోరుకు ఔటైన ఈ లెఫ్ట్ బ్యాండ్ ఆటగాడు... గౌహతిలో మాత్రం రెచ్చిపోయాడు. కేవలం 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో పది ఫోర్లు, ఐదు భారీ సిక్స్‌లు ఉన్నాయి. నితీశ్ రాణా చేసింది 81 పరుగులే అయినప్పటికీ అందో 70 పరుగులు కేవలం బౌండరీలు, సిక్సర్ల ద్వారా రావడం గమనార్హం. అలాగే, సంజూ శాంసన్ 20, రియాన్ పరాగ్ 37, హెట్మెయర్ 19 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసింది. ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సివుండగా, ఆర్ఆర్ బౌలర్ సందీప్ శర్మ కట్టడి చేయడంతో 13 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆరు పరుగుల తేడాతో చెన్నై జట్టు ఓడిపోయింది. 

అన్నీ చూడండి

ఇరాన్‌తో అణు ఒప్పందం.. తుది నిర్ణయం తీసుకోని డోనాల్డ్ ట్రంప్

వైఎస్సార్ విగ్రహం పైన దాడి చేసిన వ్యక్తి ఓ సైకో, సంయమనం పాటించండి

తెలంగాణ ప్రజలకు చల్లని కబురు : మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశం

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కమ్ములాటలు

అధికార బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి... రబ్రీదేవి

అన్నీ చూడండి

దాసరి ఇండస్ట్రీలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారు : మంచు మనోజ్

సమంతను హీరో నాగ చైతన్య మోసం చేశారా?

పవన్ ఎలాంటివారో ప్రపంచానికి చెప్పేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా: బండ్ల గణేశ్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

తర్వాతి కథనం
Show comments