విశాఖపట్టణం వన్డే మ్యాచ్‌కు వరుణ గండం

శనివారం, 18 మార్చి 2023 (14:53 IST)
స్వదేశంలో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. శుక్రవారం రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులోభాగంగా భారత్ వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. రెండో వన్డే మ్యాచ్‌ విశాఖపట్టణంలో జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచివుంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు విశాఖలో డే అండ్ నైట్ మ్యాచ్ జరుగనుండగా టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో వర్షాలు పడుతుండగా రేపు విశాఖలోనూ వరుణి ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 
 
దాంతో ఈ మ్యాచ్ జరగడంపై సందిగ్ధత నెలకొంది. నిన్న ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గడం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. 

అన్నీ చూడండి

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments