టీ20 సిరీస్ : జింబాబ్వే ముంగిట 183 రన్స్ టార్గెట్!!

వరుణ్
బుధవారం, 10 జులై 2024 (19:42 IST)
భారత్, జింబాబ్వే జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలా ఒక్కో మ్యాచ్‌లో గెలుపొందాయి. కీలకమైన మూడో వన్డే మ్యాచ్ బుధవార ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్... బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ అరథ్థ సెంచరీతో రాణించాడు. టాపార్డర్‌లో ఒక్క అభిషేక్ శర్మ తప్ప మిగిలిన అందరూ దూకుడుగా ఆడారు. అభిషేక్ వర్మ మాత్రమే కేవలం 10 పరుగులు చేసి ఔట్ కాగా, గిల్ 66 పరుగులు చేశాడు. 
 
అంతకుముందు భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, గిల్‌‍లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. కేవలం 8.1 ఓవర్లలో 67 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జైస్వాల్ 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేయగా, గిల్ 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్‌లతో 49 పరుగులు చేశాడు. మ్యాచ్ ఆఖరులో సంజూ శాంసన్ 12, రింకూ సింగ్ ఒక్క పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాని 2, కెప్టెన్ సికిందర్ రాజా 2 చొప్పున వికెట్లు తీశారు. 

అన్నీ చూడండి

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నీ చూడండి

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments