Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్ ట్రోఫీ : శ్రీలంక చేతిలో భారత్ చిత్తు... కోహ్లీ సేనకు సెమీస్ బెర్త్ అందని ద్రాక్షేనా? ఎలాగంటే?

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత కుర్రోళ్లు నిర్ధేశించిన 322 పరుగుల భారీ విజయలక్ష్యా

Written By pnr
Updated: శుక్రవారం, 9 జూన్ 2017 (14:05 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత కుర్రోళ్లు నిర్ధేశించిన 322 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని లంకేయులు అజేయంగా ఛేదించారు. దీంతో గ్రూపు-బిలో సెమీస్ బెర్త్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ గ్రూప్‌లోని నాలుగు జట్లూ రెండేసి పాయింట్లతో సమానంగా ఉండటంతో సెమీస్ బెర్త్ ఉత్కంఠగా మారింది.
 
లండన్‌లోని ఓవెల్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ నిర్ధేశించిన 322 పరుగుల విజయలక్ష్యాన్ని శ్రీలంక జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో గ్రూప్-బి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌కు వెళ్లే రెండు జట్లపై తీవ్ర ఆసక్తి నెలకొంది. గ్రూప్‌లోని నాలుగు జట్లూ రెండేసి పాయింట్లతో ఉండటమే ఈ ఉత్కంఠకు కారణం. 
 
పైగా, ఈ గ్రూపులో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. ఆదివారం భారత్, దక్షిణాఫ్రికాల మధ్య, సోమవారం శ్రీలంక, పాకిస్థాన్ నడుమ మ్యాచ్‌లు జరగాల్సి వున్నాయి. ఇక్కడ భారత్‌కు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఏంటంటే, పాకిస్థాన్‌పై సాధించిన మెరుగైన విజయంతో రన్ రేట్‌లో మిగతా మూడు జట్ల కన్నా ముందు నిలవడమే.
 
ఈ విషయాన్ని పక్కనబెడితే కోహ్లీ సేన సెమీస్‌లో అడుగుపెట్టాలంటే ఆదివారం సఫారీలతో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా విజయం సాధించాల్సి ఉంది. అపుడే సెమీస్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా వెళుతుంది. ఆపై శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్‌లో గెలిచే జట్టు దక్షిణాఫ్రికాను ఇంటికి పంపి సెమీస్‌కు అర్హత పొందుతుంది. 
 
ఇదిలావుంటే, ఈ సిరీస్‌కు వరుణ దేవుడు పదేపదే అడ్డంకి కలిగిస్తున్నాడు. ఒకవేళ దక్షిణాఫ్రికా, భారత్ మధ్య మ్యాచ్ రద్దయితే భారత్ సెమీస్‌కు వెళుతుంది. ఎందుకంటే, మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్ సాధించడం, మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా లంక, పాక్‌ల మ్యాచ్‌లో ఎవరు గెలిచినా, వారితో పాటు సెమీస్‌కు స్థానం పొందుతుంది. 
 
ఒకవేళ ఈ మ్యాచ్ కూడా రద్దయినా, భారత్‌కు వచ్చే నష్టముండదు. కానీ, దక్షిణాఫ్రికా గెలిస్తే మాత్రం భారత్‌ ఇంటికి పయనం కావాల్సిందే. అంటే దక్షిణాఫ్రికాపై తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో ఆదివారం భారత జట్టు బరిలోకి దిగనుంది. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

సెయూటాకు వలసదారులు.. తొక్కిసలాట 67మంది మృతి.. ఈదుకుంటూ వచ్చేస్తున్నారు..

సోదరీమణులారా... నా గుండెను కదిలించారమ్మా: సీఎం చంద్రబాబు వీడియో షేర్

Chandrababu Naidu పవర్‌ఫుల్ స్పీచ్, మోడీజీతోనే ప్రపంచంలో భారత్ నెం.1, Video

కేరళలో కుమ్మేస్తున్న వర్షాలు.. ఐదుగురు మృతి.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్

తిరుమలలో చైన్ స్నాచర్.. మహిళా భక్తురాలు బంగారు గొలుసును లాక్కెళ్లాడు..

అన్నీ చూడండి

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

రవీనా టాండన్ ను ఆదర్శంగా తీసుకోవాలంటున్న వెంకీ అట్లూరి

చైనా పీస్ కు యా/ఏ సర్టిఫికెట్‌, సెప్టెంబర్‌లో రిలీజ్

Varun Tej : ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉండే ఛాలెంజింగ్ ఫాత్ర పోషించా : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments