Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య... నిజం రాస్తే పాయింట్ బ్లాంక్ మర్డర్లే...

బెంగళూరులో ఒకే టైపు హత్యలు. అప్పుడు ప్రముఖ రచయిత కల్బుర్గీ, ఇప్పుడు సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య. తుపాకులతో పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. వీరి చేసింది నిజాలను నిర్భయంగా రాయడమే. అదే వారి ప్రాణాల మీదికి తెచ్చింది. వివరాల్లోకి వె

Written By ivr
Updated: బుధవారం, 6 సెప్టెంబరు 2017 (18:09 IST)
బెంగళూరులో ఒకే టైపు హత్యలు. అప్పుడు ప్రముఖ రచయిత కల్బుర్గీ, ఇప్పుడు సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య. తుపాకులతో పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. వీరి చేసింది నిజాలను నిర్భయంగా రాయడమే. అదే వారి ప్రాణాల మీదికి తెచ్చింది. వివరాల్లోకి వెళితే... మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బెంగళూరులో గౌరీ లంకేష్ తన ఇంటి గేటు తీస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌లపై వచ్చి ఆమెపై పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరిపారు. తూటాలు ఆమె మెడ, ఛాతీ భాగాల్లో దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. 
 
అయితే, గౌరీ లంకేశ్ ఇంటి ముందు అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్ ఇప్పుడు పోలీసుల ముందు సవాలుగా నిలిచింది. ఆమె తన ఇంట్లో అమర్చుకున్న సీసీటీవీలకు ఓ పాస్ వర్డ్‌ను పెట్టుకుని ఉండటమే ఇందుకు కారణం. నిందితుల వివరాలు ఈ కెమెరాల్లో రికార్డు అయి ఉంటాయని స్పష్టం చేసిన పోలీసులు, ఇప్పుడా పాస్ వర్డ్‌ను ఛేదించే పనిలో పడ్డారు. 
 
ఆ పాస్‌వర్డ్ ఆమెకు మాత్రమే తెలుసునని వెల్లడించిన సిట్ అధికారులు, రాష్ట్ర సైబర్ నిపుణులు వీడియోలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ ప్రక్రియ పూర్తయితే, ఎంతమంది హత్యలో పాల్గొన్నారన్న విషయం తేటతెల్లమవుతుందని అంటున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ విచారణకు అత్యంత కీలకమని తెలిపారు.  
 
కాగా, ఈ హత్యను పలువురు నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం హిందుత్వ రాజకీయాలను విమర్శించినందుకే ఈమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మనీష్ సిసోడియాలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. "ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే.." వ్యాఖ్యానించారు. 
 
అలాగే, సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... "ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య వార్త విని షాకయ్యాను. ఈ దారుణాన్ని ఖండించడానికి మాటలు కూడా రావడం లేదు. వాస్తవానికి ఇది ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే. ఆమె మరణంతో కర్ణాటక ఓ బలమైన ప్రగతిశీల గళాన్ని కోల్పోయింది. నేను ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయాను.." అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అలాగే, గౌరీ లంకేశ్ హత్యోదంతంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'బెంగళూరు సహా పలుచోట్ల ఎందుకింత దారుణాలు చోటుచేసుకుంటున్నాయి? దీనిపై యడ్యూరప్ప నిరవధిక సత్యాగ్రహాన్ని చేపట్టాలి. లేకుంటే బెంగళూరు 1930ల నాటి చికాగో నగరంలా మారుతుంది...' అని ట్వీట్ చేశారు.
About Author
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... Read More

అన్నీ చూడండి

Vinayak: కేఎల్ యూనివర్సిటీ చూడగానే రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తుకువస్తుంది: వినాయక్

పావలా శ్యామల కుమార్తె కు అండగా వున్న ఇండస్ట్రీ ని విమర్శించడం మనస్థాపం కలిగించాయి

Sardar 2 teaser: కార్తి, ఎస్ జె సూర్య సర్దార్ 2 యాక్షన్ టీజర్ లో ఇద్దరు గూఢచారులు

రణబాలిలో గాయపడిన రష్మిక.. డల్‌గా కనిపించిన విజయ్ దేవరకొండ

నా కుమార్తెకు పెళ్లి చేసే వయసు వచ్చింది.. ఇపుడు నాకు పెళ్లేంటి? : సురేఖావాణి

తర్వాతి కథనం
Show comments