జగన్ పాదయాత్ర అలా సక్సెస్ అవుతుందా...?

వచ్చే ఎన్నికల అనంతరం జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అంటున్నారు వైసీపీ నాయకులు. అందుకోసం ఇప్పటి నుంచే గట్టి కసరత్తు మొదలుపెట్టారు. తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గతంలో చేపట్టిన పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళి తిరుగులేని నాయకుడిగా పేరు సాధించడం తెలిసింద

మంగళవారం, 24 అక్టోబరు 2017 (19:46 IST)
వచ్చే ఎన్నికల అనంతరం జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అంటున్నారు వైసీపీ నాయకులు. అందుకోసం ఇప్పటి నుంచే గట్టి కసరత్తు మొదలుపెట్టారు. తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గతంలో చేపట్టిన పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళి తిరుగులేని నాయకుడిగా పేరు సాధించడం తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి కూడా చివరకు పాదయాత్రపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడు ఆ పాదయాత్రకు కోర్టు తీర్పు కాస్త అడ్డంకిగా తగులుతోంది. పాదయాత్ర చేస్తున్నా వెసులుబాటు కల్పించాలంటూ సిబిఐ కోర్టులో వేసిన పిటిషన్‌ను కొట్టి వేయడంతో ఇబ్బందిగా మారింది. ఐతే పైకోర్టుకు వెళ్లేందుకు జగన్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 
 
పాదయాత్ర మొదలుపెట్టే ముందుగానే ఆయన తనకు శత్రువులుగా ఉన్న వారందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును బాగా దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రామోజీరావు కోడలు, జగన్ సతీమణి ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళయిపోయారు. దీంతో వీరి మధ్య పెద్దగా గొడవలు ఉండవని అందరూ భావించారు. ఆ తరువాత రామోజీకి దగ్గరయ్యారు జగన్. 
 
ఇలా జగన్ పాదయాత్రకు పత్రికల వైపు నుంచి కూడా మెల్లగా మద్దతు కూడగట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద నవంబర్ నెల నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేసి వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న కృతనిశ్చయంతో జగన్ మోహన్ రెడ్డి వున్నారు.

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments