మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:26 IST)

గుంటూరును వణికిస్తున్న అక్రమ సంబంధాల హత్యలు

అక్రమ సంబంధాల నేపధ్యంలో జరుగుతున్న హత్యలు గుంటూరును వణికిస్తున్నాయి. మిస్సింగ్ కేసులు, అనుమానాస్పద మృతి కేసులు, చివరకు హత్యలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవటానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. గుంటూరు జిల్లాను వరుస హత్యలు వణికిస్తున్నాయి.
 
వరుస పెట్టి హత్యలు జరుగుతుండటం, అవి కూడా అక్రమ సంబందాలు నేపధ్యంలోనే జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న పిడగురాళ్ళ పురుగు మందుల వ్యాపారి దారుణ హత్య, నిన్న చెరుకుపల్లిలో ఆర్ఎంపీ వైద్యుడి దారుణ హత్య, ఇప్పుడు ఒక మహిళా టీచర్ దారుణ హత్య.
 
అంతేకాదు మంగళగిరిలో భవనిర్మాణ పనులు చేసుకునే సీతారామంజనేయులు కూడా అక్రమ సంబంధం నేపధ్యంలోనే హత్యకు గురయ్యాడు. అంతేకాదు వేమూరు మండలం కుచ్చెళ్ళపాడుకు చెందిన వ్యవసాయ కూలి ప్రకాశరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటంపై కూడా అతని తల్లి పోలీసులను ఆశ్రయించింది.
 
భార్యే అక్రమ సంబంధం నేపధ్యంలో హత్య  చేయించిందని ఫిర్యాదు చేయటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఒక్క నెల రోజుల వ్యవధిలోనే ఐదు హత్యలు, అవి కూడ అక్రమ సంబంధం నేపధ్యంలో జరిగినవిగా వెల్లడి కావటం సంచలనంగా మారింది.