Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంగల్యంలో స్త్రీలు ముత్యాన్ని చేర్చుకుంటే..?

Written By Selvi
Updated: శనివారం, 17 జనవరి 2015 (15:43 IST)
స్త్రీలు తమ మాంగల్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. తమ సౌభాగ్యాన్ని నిలుపుకునేందు వ్రతాలు, నోములు నోస్తారు. మాంగల్యానికి దృష్టి సంబంధమైన దోషాలు తొలగిపోవడానికి నల్లపూసలు, సంతాన భాగ్యాన్ని కలిగించే పగడాలను తమ సూత్రాలకు చేరుస్తుంటారు.
 
ఈ నేపథ్యంలో చంద్రగ్రహ కారకాలుగా చెప్పబడే 'ముత్యాలు' కూడా స్త్రీలు ఎక్కువగా ఉపయోగిస్తూ వుంటారు. ఇక స్త్రీలు మంగళ సూత్రానికి ముత్యాన్ని చేర్చే ఆచారం మనకి ప్రాచీనకాలం నుంచి కనిపిస్తుంది. 
 
శ్రీరామమవమి రోజున సీతారాముల కల్యాణం జరినప్పుడు ... అలాగే తమ ఊళ్లో వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిగినప్పుడు, అత్తవారింట్లో వున్న ఆడపిల్లలను ఆహ్వానించే ఆచారం వుంది.
 
కల్యాణం సమయంలో స్వామివారికి .. అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు పోస్తారు. అలా పోయబడిన ముత్యాలను అక్కడి అర్చకులు వివాహితులైన స్త్రీలకు ఒక్కొక్కటి చొప్పున ఇస్తుంటారు. 
 
ఆ ముత్యాన్ని మంగళ సూత్రానికి చేర్చి కట్టుకోవడం వలన, అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యం సుస్థిరమవుతుందని స్త్రీలు భావిస్తుంటారు. ప్రాచీనకాలం నుంచి ఈ విశ్వాసం బలపడుతూ రావడం వలన ఈ ఆచారం ఇప్పటికీ నిలిచివుందని చెప్పొచ్చు.

అన్నీ చూడండి

ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేస్తే 2 నిమిషాల్లో ఆమోదిస్తా: సీఎం డికె శివకుమార్ భారీ షాక్

రైలు ప్రయాణీకులకు నరకం చూపిస్తున్న హిజ్రాలు, రైల్వే అధికారులు పట్టించుకోరా?

కిడ్నాప్ ఆరోపణల కేసు.. వైకాపా నేత షేక్ మహ్మద్ ముస్తఫా అరెస్ట్

దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులు

వెనిజువెలాలో భారీ భూకంపం... మృతుల సంఖ్య 6,125 పైమాటే...

అన్నీ చూడండి

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారి అమెరికా ప్రవచనం ముఖ్యాంశం

04-08-2026 మంగళవారం ఫలితాలు.. మీ కష్టం వృధాకాదు.. శుభవార్త వింటారు..

03-08-2026 సోమవారం ఫలితాలు - అప్రమత్తంగా ఉండాలి.. భేషజాలకు పోవద్దు...

02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

Show comments