మొబైల్‌ ఫోనుతో 'టెక్ నెక్' సమస్య ... ఇవి కూడా వచ్చేస్తాయ్...

ఏ వస్తువునైనా... ఆఖరికి శరీరాన్నయినా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మితిమీరి వాడితే తేడా చేస్తుంది. సెల్ ఫోను కూడా అంతే. సెల్ ఫోనులో గంటల తరబడి మాట్లాడేవారికి మొటిమలు, అలెర్జీలు, చర్మంపై ముడతలు, నల్లమచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం వుందన

సోమవారం, 26 జూన్ 2017 (16:18 IST)
ఏ వస్తువునైనా... ఆఖరికి శరీరాన్నయినా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మితిమీరి వాడితే తేడా చేస్తుంది. సెల్ ఫోను కూడా అంతే. సెల్ ఫోనులో గంటల తరబడి మాట్లాడేవారికి మొటిమలు, అలెర్జీలు, చర్మంపై ముడతలు, నల్లమచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం వుందని అధ్యయనాలు చెపుతున్నాయి. 
 
* గంటల తరబడి మొబైల్ ఫోన్‌ను చూస్తుండటం వల్ల గడ్డం కింద, మెడ కింద ముడతలు ఏర్పడుతాయి. వీటిని టెక్ నెక్ అంటారు.
 
* చంపలపై దద్దుర్లు, ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా వుంది. ఎందుకంటే చాలా స్మార్ట్ ఫోన్ల కేసింగ్స్ పైన నికెల్, క్రోమియంలు వుంటాయి. వీటివల్ల ముఖం మీద వున్న చర్మంపై అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ వచ్చే అవకాశం వుంది. అందుకే మొబైల్ పైన ప్లాస్టిక్ కేసును వాడితే చర్మానికి మంచిది. 
 
* మొబైల్ ఫోనుపైన సూక్ష్మక్రిములు పేరుకుని వుంటాయి. ఫలితంగా చర్మంపై మొటిమలు వస్తాయి. ముఖానికి దగ్గరగా పెట్టుని ఫోనులో మాట్లాడటం వల్ల ముఖానికి వున్న చమట, మేకప్ తదితరాలు ఫోనుకు అంటుకుంటాయి. కొందరికి సెల్ ఫోనను వాష్ రూముకు తీసుకెళ్లే అలవాటు వుంటుంది. అక్కడే తిష్ట వేసి వున్న సూక్ష్మక్రిములు ఫోనుపైకి చేరి రోగాన్ని కలిగిస్తాయి. కనుక ఇలాంటి సమస్యల లేకుండా వుండాలంటే మొబైల్ ఫోనును తరచూ శుభ్రం చేస్తుండాలి. 40 శాతం ఆల్కహాల్ వున్న క్లీన్సర్లతో వీటిని తుడవాలి. ఇయర్ ఫోన్స్ వాడితే చాలావరకు సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
 
* ఫోను వేడి కారణంగా ముఖంపై నల్లని మచ్చలు వచ్చే అవకాశం వుంది. కాబట్టి వీలైనంత తక్కువగా ఫోనులో మాట్లాడితే మేలు.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ కార్యకలాపాల విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో రుణ వితరణ: రూ.393.17 కోట్ల రుణాలను మంజూరు చేసిన కెనరా బ్యాంక్, రూ. 36.85 లక్షల సీఎస్ఆర్ సాయం

వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

అన్నీ చూడండి

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments