శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 13 జనవరి 2024 (17:49 IST)

మధ్యాహ్నం భోజనం మానివేస్తే ఏమవుతుందో తెలుసా?

చాలామంది బరువు తగ్గటానికి మధ్యాహ్నం భోజనం తినడాన్ని మానివేస్తుంటారు. ఐతే ఆహారంలో మధ్యాహ్న భోజనం అత్యంత ముఖ్యమైన భాగం. ఏ కారణం చేతనూ మధ్యాహ్న భోజనం మానేయకూడదు. మధ్యాహ్నం భోజనం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
 
బరువు తగ్గాలనే సాకుతో మధ్యాహ్న భోజనం మానేస్తే ఆరోగ్యానికి చాలా హానికరం.
రెగ్యులర్‌గా మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల తలనొప్పి, శరీరం అలసటకు దారితీస్తుంది.
మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల బరువు పెరుగుతారు తప్ప కొవ్వు తగ్గదు.
మధ్యాహ్న భోజనం దాటవేయడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది.
మధ్యాహ్న భోజనం మానేసిన వారు అలసిపోతారు, శరీరానికి అవసరమైన పోషకాలు అందవు.
గుండెల్లో మంట, అసిడిటీ సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది.
మధ్యాహ్న భోజనం మానేస్తే సాయంత్రానికి విపరీతంగా ఆకలి వేస్తుంది, ఇది అనారోగ్యకరమైన ఆహారపు అలవాటవుతుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధ్యాహ్నం 12 నుండి 1 గంటల మధ్య భోజనం చేయడం ఉత్తమం.