కళ్లద్దాలు ఎందుకు.. కంటి నిండా నిద్రపోండి..

గంటల పాటు కంప్యూటర్లకు అతుక్కుపోవడం ద్వారా కంటి ఆరోగ్యం మందగిస్తుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తప్పట్లేదు. ఇలాంటి కంటి దృష్టి లోపాల నుంచి గట్టెక్కేందుకు చాలామంది కళ్లద్దాలు వాడుతున్నారు. అయితే కళ్లద

ఆదివారం, 22 జులై 2018 (11:41 IST)
గంటల పాటు కంప్యూటర్లకు అతుక్కుపోవడం ద్వారా కంటి ఆరోగ్యం మందగిస్తుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తప్పట్లేదు. ఇలాంటి కంటి దృష్టి లోపాల నుంచి గట్టెక్కేందుకు చాలామంది కళ్లద్దాలు వాడుతున్నారు. అయితే కళ్లద్దాలు వాడటం కంటే పోషకాహారం తీసుకుంటే కంటి దృష్టి సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా రోజూ ఓ కప్పు మునగాకు, ఓ కోడిగుడ్డును ఆహారంలో తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఆకుకూరలు, కాయగూరలతో చేసే సలాడ్లలో విటమిన్‌ ఎతోపాటూ కెరొటినాయిడ్స్‌, జియాంతిన్‌, లెట్యూన్‌ వంటి పోషకాలు ప్రత్యేకంగా అందుతాయి. ఈ పోషకాలు కంటికి హానిచేసే తీవ్రమైన కాంతి నుంచి శరీరానికి రక్షణగా నిలుస్తాయి. కాయగూరలతో చేసిన సలాడ్లవల్ల చిన్నవయసులో కళ్లద్దాల అవసరం వుండదు. 
 
అలాగే కంటి దృష్టి లోపాలను దూరం చేసుకోవాలంటే.. కంటినిండా నిద్ర తప్పనిసరి.  ఇన్‌సోమ్నియా వంటి నిద్రలేమి సమస్యలున్నవారు రోజూ సలాడ్‌ తినడం వల్ల హాయిగా, కంటినిండా నిద్రపోవచ్చు. సలాడ్లలో ఎక్కువగా ఉపయోగించే లెట్యూస్‌ ఆకులో మంచి నిద్రకు అవసరం అయిన లెక్ట్యూకారియమ్‌ అనే రసాయనం ఉంటుంది.
 
అలాగే కంటిచూపు సమస్యలను దూరం చేసుకోవాలంటే.. ఎక్కువ కాయగూరలు తీసుకోవాలి. పచ్చికాయగూరల వల్ల శరీరంలో ఎంజైములు ఎక్కువగా వచ్చి చేరతాయి. ఈ ఎంజైములు శరీరం పోషకాలని ఎక్కువగా స్వీకరించేందుకు దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ కార్యకలాపాల విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో రుణ వితరణ: రూ.393.17 కోట్ల రుణాలను మంజూరు చేసిన కెనరా బ్యాంక్, రూ. 36.85 లక్షల సీఎస్ఆర్ సాయం

వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

అన్నీ చూడండి

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments