వెల్లుల్లి రెబ్బల్ని వేడి నీటిలో వేసుకుని తీసుకుంటే?

ఆదివారం, 12 మే 2019 (12:27 IST)
వెల్లుల్లి రెబ్బల్ని బాగా దంచుకుని వేడినీటిలో వేసుకుని తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తరచూ జలుబూ, జ్వరాలకు గురయ్యేవారు వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలూ, తేనె, అల్లం కలిపి ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 
 
ఈ రెబ్బల్లోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ని తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయులు కూడా పెరగకుండా చేస్తాయి. వెల్లుల్లి టీని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 
 
వెల్లుల్లి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. రోజూ ఒక కప్పు వెల్లుల్లి టీని తాగితే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం తగ్గిపోతాయి. వెల్లులిని తరచూ తీసుకోవడం వల్ల రొమ్మూ, ఉదర, మూత్రాశయ క్యాన్సర్లు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments