జీవామృతాలు చిరుధాన్యాలు...

బుధవారం, 24 జులై 2019 (18:04 IST)
దేశవ్యాప్తంగా కరవుకాటకాలు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, వర్షపాతం గణనీయంగా తగ్గిపోయింది. అతివృష్టి లేదా అనావృష్టి మాత్రమే కనిపిస్తోంది. దీంతో ఎక్కువ నీటితో పండించే వరి వంటి పంటలు పడించే పరిస్థితి అయితే లేదు. ఈ క్రమంలో అతి తక్కువ నీటితో పండించే పంటలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ క్రమంలో ఇటీవలి కాలంలో చిరు ధాన్యాలే భవిష్యత్ ఆహార ధాన్యాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. వీటిలో అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. భారతీయ సంప్రదాయ ఆహారపు గింజలుగా చిరు ధాన్యాలను పేర్కొంటున్నారు.
 
తృణ ధాన్యాలు అనేవి ఇపుడు కొత్తగా తెరపైకి వచ్చినవి కావని, ఇవి మన పూర్వీకుల నుంచి వస్తున్న జీవామృతాలుగా పలువురు పేర్కొంటున్నారు. మనిషి ఆరోగ్యం వారి ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలో పాశ్య్చాత్య ఆహారపు అలవాట్లు విపరీతంగా పెరిగిపోయాయి. 
 
ఫలితంగా అనేక రకాలైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలో చిరుధాన్యాలను వాడినట్టయితే మనిషికి కావాల్సిన పూర్తిస్థాయి పోషక విలువలు అందుతాయని పేర్కొంటున్నారు. వీటివల్ల మధుమేహం, బీపీతో అనేక రకాల వ్యాధులను అరికట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

అన్నీ చూడండి

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రొఫెసర్ మనీషా అరెస్టు

భార్యను గొడ్డలితో నరికేసి ఠాణాకు వెళ్లి లొంగిపోయిన వృద్ధుడు

లైంగిక వేధింపులు - భారత సంతతికి చెందిన 13 యేళ్ల జైలు

స్టాలిన్ ఓడిపోవడం బాధ కలిగించింది.. చౌకబారు వ్యక్తిని కాదు : రజనీకాంత్

ప్రాణాంతక ఎబోలా వైరస్ - హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ

అన్నీ చూడండి

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

తర్వాతి కథనం
Show comments