ఆ పాలు అస్సలు తాగొద్దండీ..

పచ్చి పాలు అస్సలు తాగకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలట. లేకపోతే తీవ్ర అనారోగ్యం పాలయ్యే అవకాశముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చిపాలను తాగడం వల్ల బ్లూసిల్లోసిస్‌తో పాటు పశువుల ద్వారా సంక్రమించే ఇత

Written By chj
Updated: ఆదివారం, 13 ఆగస్టు 2017 (13:51 IST)
పచ్చి పాలు అస్సలు తాగకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలట. లేకపోతే తీవ్ర అనారోగ్యం పాలయ్యే అవకాశముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చిపాలను తాగడం వల్ల బ్లూసిల్లోసిస్‌తో పాటు పశువుల ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులు మనుషులకు సోకుతాయట. కర్ణాటక రాష్ట్రంలో పశువుల్లో బ్లూసిల్లోసిస్‌తో పాటు గాలికుంటు వ్యాధి, నోటికి సంబంధించిన ఇతర వ్యాధులను గుర్తించారు. 
 
వైరస్ కారణంగా ఈ వ్యాధులు వ్యాపిస్తుండగా.. గొర్రెలు ఈ వైరస్‌కు వాహకాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మరిగించిన పాశ్చరైజేషన్ చేసిన పాలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ వైరస్ నశిస్తుందట. కాబట్టి వేడి చేసిన పాలను మాత్రమే తాగాలట. ఇటీవల కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లోని పశువులకు ఈ వ్యాధి వ్యాపించిందట. అందుకే అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. పశువులకు వ్యాక్సిన్‌లు వేసినా ఉపయోగం లేదంటున్నారు వైద్యులు. అందుకే పచ్చిపాలను ఎట్టి పరిస్థితిల్లో తీసుకోకుండా వేడి చేసిన వాటినే తీసుకోవాలట.

అన్నీ చూడండి

నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు?

మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీ

ప్రజల కోసం దెబ్బలు తినేందుకు సైతం సిద్ధమే : రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

Madhav's look : యుద్ధంలో పోరాడినట్లుగా మారెమ్మ నుంచి మాధవ్ లుక్

తర్వాతి కథనం
Show comments