నిల్చొని నీళ్లు తాగొచ్చా?

శుక్రవారం, 23 ఆగస్టు 2019 (15:03 IST)
నీళ్లు బాగా త్రాగితే ఆరోగ్యానికి మంచిదని మనకు తెలిసిన విషయం. కానీ నీళ్లు త్రాగేటప్పుడు కూర్చుని త్రాగాలి. అలా కాకుండా నిలబడి త్రాగితే చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ నిలబడి తాక్కూడదని చాలా మందికి తెలియదు. ఇలా తాగితే ఆరోగ్య పరంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు. 
 
ఇలా తాగితే కిడ్నీలకు ఆ నీరు అందదని, దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి చేరతాయి. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీంతో అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి. 
 
జీర్ణాశయ గోడలు దెబ్బతింటే అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. నిలబడి నీరు తాగితే ద్రవాల సమతుల్యత దెబ్బతినడంతో ఎక్కువ ద్రవాలు కీళ్లలో చేరిపోయి కీళ్ల నొప్పులు వస్తాయి. కూర్చున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో నీరు తీసుకుంటే తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా జీర్ణాశయంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాల ప్రభావం కూడా తగ్గుతుంది.
 

అన్నీ చూడండి

Nara Lokesh: ప్రత్యేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఏపీ సర్కారు రెడీ

ఏపీలో 10 రోజులు సర్ గడువు పొడిగింపు... ఎన్నికల సంఘం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు

రోడ్డు ప్రమాదాలు కామనే.. 18 ఏళ్ల యువకుడిపై కేసు పెడతారా?: వైఎస్ జగన్

మా బిడ్డ జీవితం కళ్లముందే బూడిదైపోయాడు : కేతన్ అగర్వాల్ తల్లి

అన్నీ చూడండి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments