Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిల్చొని నీళ్లు తాగొచ్చా?

Written By సందీప్
Updated: శుక్రవారం, 23 ఆగస్టు 2019 (15:04 IST)
నీళ్లు బాగా త్రాగితే ఆరోగ్యానికి మంచిదని మనకు తెలిసిన విషయం. కానీ నీళ్లు త్రాగేటప్పుడు కూర్చుని త్రాగాలి. అలా కాకుండా నిలబడి త్రాగితే చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ నిలబడి తాక్కూడదని చాలా మందికి తెలియదు. ఇలా తాగితే ఆరోగ్య పరంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు. 
 
ఇలా తాగితే కిడ్నీలకు ఆ నీరు అందదని, దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి చేరతాయి. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీంతో అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి. 
 
జీర్ణాశయ గోడలు దెబ్బతింటే అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. నిలబడి నీరు తాగితే ద్రవాల సమతుల్యత దెబ్బతినడంతో ఎక్కువ ద్రవాలు కీళ్లలో చేరిపోయి కీళ్ల నొప్పులు వస్తాయి. కూర్చున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో నీరు తీసుకుంటే తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా జీర్ణాశయంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాల ప్రభావం కూడా తగ్గుతుంది.
 

అన్నీ చూడండి

తెలంగాణాలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భర్త మెడకు కరెంట్ వైర్ బిగించి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య

నేపాల్ వరద ప్రళయం మృతులు 675 - 275 మంది భారతీయుల జాడ ఎక్కడ?

నేడు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష - మద్యం సేవించి పరీక్షకు వచ్చిన విద్యార్థి

నేపాల్‌కు మళ్లీ వరద హెచ్చరిక - అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments