భోజనం చేశాక, చేయకముందు ఏం చేయాలో తెలుసా?

మంగళవారం, 2 జులై 2019 (12:42 IST)
మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే కష్టంగా ఉన్నా కొన్ని పద్ధతులను ఇష్టంగా పాటించవలసిందే. ప్రస్తుతకాలంలో ఎక్కువమంది ఎదుర్కుంటున్న సమస్య అధిక బరువు. సాధారణంగా బరువు పెరగడం చాలా తేలికగా పెరుగుతాము. కానీ తగ్గాలంటే చాలా కష్టపడాలి. ఈ సమస్య రాకుండా ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అందుకు భోజనం చేయకముందు, చేశాక కొన్నింటిని తినకుండా ఉంటే బరువు పెరగడం, పొట్ట పెరగడం లాంటి వాటిని నివారించవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. భోజనం చేసే ముందు లేదా తరువాత పండ్లు ఎక్కువగా తినకూడదు. అందువల్ల పొట్ట బాగా పెరిగే అవకాశం ఉంది.
 
2. అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు. అలా చేస్తే తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి.
 
3. ఎప్పుడైనా తినగానే స్నానం చేయకూడదు. దానివల్ల కాళ్లు, చేతులులోకి రక్తప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
 
4. అలాగే భోజనం అయ్యాక పది నిముషాల పాటు నడిస్తే మంచిదని అంటుంటారు. కానీ... అలా నడవడం వలన పోషకాలను గ్రహించడంలో జీర్ణ వ్యవస్థ విఫలమవుతుంది. కాబట్టి తిన్న వెంటనే కాకుండా ఒక పది నిమిషముల తరువాత నడిస్తే మంచిది.
 
5. ముఖ్యంగా తినగానే నిద్రపోకూడదు. అలా నిద్రపోతే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి.

అన్నీ చూడండి

సిద్ధరామయ్య ఇంట్లో అల్పాహార సమావేశం.. కావేరికి చేరిన డీకే శివకుమార్

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments