Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగ చిగుళ్లు, మునగ చెట్టు వేరు, మునగ జిగురు తీసుకుంటే...

మనం ప్రతి రోజు రకరకాల ఆహార పదార్థాలను, కాయగూరలను, ఆకుకూరలను తింటూ ఉంటాం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు రక్తహీనతను తగ్గించటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆకుకూరల్లో ముఖ్యమైనది మునగాకు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని తర

Written By chj
Updated: సోమవారం, 30 జులై 2018 (22:00 IST)
మనం ప్రతి రోజు రకరకాల ఆహార పదార్థాలను, కాయగూరలను, ఆకుకూరలను తింటూ ఉంటాం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు రక్తహీనతను తగ్గించటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆకుకూరల్లో ముఖ్యమైనది మునగాకు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని తరచుగా ఉపయోగించటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. అవి ఏమిటో తెలుసుకుందాం.
 
1. లేత మునగ చిగుళ్లు రోజూ రసం తీసుకొని త్రాగితే ఒళ్లు తగ్గుతుంది.
 
2. మునగచెట్టు వేరును దంచి రసం తీసి ఆ రసంలో తేనె కలిపి పాలతో తాగిస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి. పక్షవాతం ఉన్నా తగ్గుతుంది.
 
3. మునగ జిగురు ఆవు పాలలో మెత్తగా నూరి నుదురు మీద, కణతల మీద పట్టి వేస్తే తలనొప్పి త్వరగా తగ్గుతుంది. 
 
4. మునగాకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని పప్పులో పెట్టుకొని వారంలో రెండు రోజులు తినటం వలన శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది. ఇది కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
 
5. మునగాకులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీనిని ప్రతిరోజు తీసుకోవటం వలన కళ్లను ఆరోగ్యంగా ఉంచి కంటిచూపును మెరుగుపరుస్తుంది.
 
6. ఒక టేబుల్ స్పూన్ మునగాకు పేస్టులో కొంచెం తేనె, కొంచెం నీటిని కలిపి ప్రతిరోజు కాళీ  కడుపుతో త్రాగటం వలన శరీరంలోని కొవ్వు తగ్గి సన్నగా, నాజూగ్గా తయారవుతారు.
 
7. మునగాకు ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ పేస్టును ముఖానికి తరచూ రాసుకోవటం వలన మెుటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

అన్నీ చూడండి

నా జీవితాన్ని ప్రధాని మోడీ నరకం చేశారు : రుచికా సింగ్ (వీడియో)

అత్యాచారాన్ని ప్రతిఘటించిన నర్సు ... చంపేసిన కామాంధుడు

మత్తు రహిత సమాజం కోసం యువత ప్రతినబూనాలి : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు

గదిలో ఏకాంతంగా ప్రియుడితో దొరికిన భార్య.. ప్రియుడితో కలిసి గొంతు నులిమి భర్త హత్య

ఉపాధ్యాయుడి సమయస్ఫూర్తి - నిలిచిన 1643 మంది చిన్నారుల ప్రాణాలు

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments