వర్షాకాలంలో అనారోగ్యాలకు ఇది దివ్యౌషధం

Updated: గురువారం, 1 ఆగస్టు 2019 (17:41 IST)
జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపినా ప్రయోజనం ఉంటుంది. 
 
యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కను సమభాగాల్లో కలపి చూర్ణం చేసుకొని భద్రపరుచుకోవాలి. కప్పు నీటిని మరిగించి, ఆ నీటిలో పావు చెంచా పొడి వేసి టీలా కాచుకోవాలి. చివర్లో ఎనిమిది తులసి ఆకులు వేసి వేడివేడిగానే తాగాలి. ఇలా నిత్యం చేస్తే వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. 
 
కప్పు పాలల్లో అరచెంచా శొంఠి పొడి వేసి కలిపి కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలిపి తాగాలి. శొంఠి, పిప్పళ్లు, మిరియాలను విడివిడిగా మెత్తాగా పొడి చేసి సమభాగాల్లో కలుపుకోవాలి. దీన్ని త్రికటు చూర్ణం అంటారు. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జర్వం, దగ్గు, జలుబు, అలర్జీని నిరోధిస్తుంది.
 
శొంఠి కషాయంలో ఒక చెంచాడు ఆముదం కలిపి రాత్రి పడుకునేటప్పుడు సేవిస్తే విరేచనం సాఫీగా అవుతుంది. కడుపులో వాయువు తగ్గుతుంది. సయాటికా తగ్గుతుంది. ఇలా రోజు విడిచి రోజు మూడుసార్లు చేయవచ్చు.

అన్నీ చూడండి

నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు?

మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీ

ప్రజల కోసం దెబ్బలు తినేందుకు సైతం సిద్ధమే : రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

Madhav's look : యుద్ధంలో పోరాడినట్లుగా మారెమ్మ నుంచి మాధవ్ లుక్

తర్వాతి కథనం
Show comments