ganesh chaturthi

గుండె జబ్బులు రాకుండా వెల్లుల్లి పాయసం తాగితే చాలు... ఎలా చేయాలో తెలుసా?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (20:27 IST)
ధమనుల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు రక్త ప్రసరణ మార్గం చిన్నదవుతుంది. ఈ సమస్యనే ఎథిరోస్క్లైరోసిస్ అంటారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ధమనులు ఇంకా కుంచించుకుపోయి గుండెకి, మెదడుకి, మూత్రపిండాలకు శరీరంలో సమస్త భాగాలకు జరిగే రక్తసరఫరాలో సమస్యలు వస్తాయి.

దీనివల్ల గుండెపోటు లేదా మెదడు రక్త కణాలు చిట్లిపోవడమో జరిగి ప్రాణాపాయం ఏర్పడుతుంది. సమస్య అంతదాకా వచ్చిన తర్వాత ఆసుపత్రులకు పరుగెత్తేకంటే సమస్య రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 
 
రోజూ ఒక వెల్లుల్లి రేకును నమిలి మింగితే చాలు. అలాగే వెల్లుల్లిని పాలలో ఉడికించి పాయసం (రసోనా క్షీరం) తయారుచేసుకుని తాగినా ప్రయోజనం వుంటుంది.
 
పాయసం తయారుచేసే పద్ధతి
ఐదు గ్రాముల వెల్లుల్లి రేకులు తీసుకుని దాని పైపొట్టును తొలగించి, వాటిని 50 మిల్లీలీటర్ల పాలల్లో 6 గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని తీసి 200 మిల్లీలీటర్ల పాలలో వేసి సగానికి సగం తగ్గేదాకా మరిగించాలి. ఆపై వడబోసి నేరుగా కానీ, మధుమేహం లేనివారైతే చక్కెర కలిపి కానీ రోజూ రాత్రివేళ నిద్ర పోయే ముందు సేవిస్తే ధమనులు గట్టిపడి, గుండె సంబంధమైన సమస్యలు రావు. 

అన్నీ చూడండి

ఆహార భద్రతా సమస్యల పరిష్కారం కోసం స్విగ్గీ ప్రత్యేక కస్టమర్ సపోర్ట్, హెల్ప్‌లైన్‌ ప్రారంభం

ప్రధాన కార్యాలయ మార్కెట్లలో హైదరాబాద్ రెండో అత్యధిక REIT నమోదు

బాడీ బిల్డర్‌నని అహంకారమా? మహిళా బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు అరెస్ట్

హరిద్వార్ గంగాఘాట్‌లో టూపీస్‌తో మహిళ స్నానం.. వీడియోపై రచ్చ రచ్చ (video)

గోవా కోర్టులో లొంగిపోయిన తరుణ్ తేజ్‌పాల్..

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments