ఆరోగ్యంగా వుండాలంటే.. టీవీ చూస్తూ భోజనం చేయకూడదట..

గురువారం, 18 జులై 2019 (13:07 IST)
ఆరోగ్యంగా వుండాలంటే.. ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రత కొరవడితే ఒత్తిడి తప్పదు. అందుచేత ఏకాగ్రతను పెంచుకోవాలి. ఏకాగ్రత అనేది పెరగాలంటే.. ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో మరింత శక్తి పెరుగుతుంది. అలాగే ఏకాగ్రత పెరిగేందుకు రోజూ కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేయండి 
 
ఆరోగ్యంగా ఉండేందుకు ఏకాగ్రతతో భోజనం చేయాలి. టీవీ చూస్తూనో లేదా కంప్యూటర్‌తో పనిచేస్తూనో భోజనం చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వార్తా పత్రికలు, పుస్తకాన్ని చదువుతూ భోజనం చేయకూడదు. దీంతో మీలో ఏకాగ్రత నశిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.  
 
వృత్తిని వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టకూడదు. ఈ రెండింటి మధ్య సత్సంబంధాలు కలిగి ఉండేందుకు ఏకాగ్రత చాలా అవసరం. ఇంకా జీవనశైలిని మార్చుకుంటే మీలో శక్తిసామర్థ్యాలు మరింతగా పెరుగుతాయి. దీంతో జీవితాంతం సుఖంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. 
 
అలాగే ప్రతి రోజు క్రమం తప్పకుండా రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్రతో శరీరానికి మరింత శక్తిని అందించినవారవుతారు. నిద్రలేమితో ఒత్తిడి, కళ్ళకింద నల్లటి చారలు, అధిక రక్తపోటు తదితర సమస్యలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. కాబట్టి ప్రతి రోజు క్రమం తప్పకుండా కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

వచ్చే యేడాది నుంచి ఆన్‍‌లైన్‌లో నీట్ ప్రవేశపరీక్ష : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

తిరుపతిలో దారుణం, వేసవి శెలవులకు వచ్చిన 16 ఏళ్ల బాలికపై బాబాయ్ అత్యాచారం

నీట్-యూజీ 2026: జూన్ 21న మళ్లీ పరీక్ష.. ఎన్టీఏ ప్రకటన

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments