మలేరియా రాకుండా వుండాలంటే ఈ ఆకు నమలాల్సిందే

సోమవారం, 21 అక్టోబరు 2019 (11:21 IST)
వర్షాకాలంలో మలేరియా లాంటి వైరల్ జ్వరాలకు తులసి మంచి విరుగుడు. తులసి ఆకుల కషాయం జ్వరం తీవ్రతను తగ్గిస్తుంది. తులసి ఆకులతో ఆవిరి పడితే జలబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు ఈ కషాయం తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ ఆకులతో ఆవిరి పట్టినా, వాసన చూసినా శ్వాస సంబంధ వ్యాధులకు మంచి ఉపశమం కలుగుతుంది. దీన్నే ఆరోమా థెరపీ అనికూడా అంటుంటారు.
 
* తులసి ఆకులను టీలో మరిగించి కూడా తీసుకోవచ్చు. టీకి మంచి సువాసనతో పాటు ఘాటైన రుచి కూడా వస్తుంది. వానాకాలంలో ఇది చాలా మేలు చేస్తుంది. ఏడాది నిండిన పిల్లలకు రోజూ ఒక చెంచా తులసి రసం తాగిస్తే జీర్ణ శక్తి పెరుగుతుంది. తరచూ జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు.
 
* కళ్ళు మండుతున్నా, ఎరుపెక్కినా తులసి కషాయం పలుచగా చేసి.. దాంతో కళ్ళు కడిగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది. నీడన ఆరబెట్టిన తులసి ఆకులను పొడి చేసి... ఒక టీస్పూన్ పొడికి, చిటికెడు సైంధవలవణం చేర్చి పళ్ళు తోముకుంటే పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యల్ని నివారించుకోవచ్చు. తులసి కషాయం, అల్లం రసం సమపాళ్ళలో కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.
 
* తులసి రసంలో కాస్త నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మ సంబంధ సమస్యలు మటుమాయమవుతాయి. తులసి ఆకుల పొడిని పెసరపిండిలో కలిపి ఒంటికి రాసుకొని స్నానం చేస్తే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. మొటిమలు తొందరగా తగ్గుతాయి. అయితే దీనిని ఎక్కువగా వాడకూడదు. రోజూ పది పదిహేను ఆకుల్ని మించి తినకండి. ఆకులు కాస్త చేదుగా, వగరుగా ఉంటాయి. కనుక కడుపులో ఒకలాంటి ఇబ్బందిగా ఉంటుంది.

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments