నేరేడు పళ్లు వచ్చేసాయి, వాటిని తింటే ఏమవుతుందో తెలుసా?

బుధవారం, 21 జులై 2021 (21:37 IST)
వర్షాకాలం రాగానే కొన్ని సీజనల్ పండ్లు మార్కెట్లో దర్శనమిస్తాయి. వేసవిలో వచ్చిన మామిడిపళ్లు మెల్లగా మాయమవ్వగా ఇప్పుడు నేరేడు పండ్లు వచ్చేసాయి. ఈ నేరేడు ఆకులు లేదా గింజల్ని ఎండబెట్టి పొడి చేసి రోజూ ఓ టీ స్పూన్ మేర తేనెతో కలిపి తీసుకుంటే మధుమేహంతో ఇబ్బందిపడే వారికే కాదు.. అందరికీ మేలు జరుగుతుంది. 
 
పొడిని నీళ్లలో వేసి మరిగించి కషాయం రూపంలో సేవిస్తే మధుమేహులకి మరీ మంచిది. ముఖ్యంగా గింజల్లోని గ్లైకోసైడ్‌ పిండిపదార్థాల్ని చక్కెరలుగా మారకుండా అడ్డుకుంటుంది. పైగా క్లోమగ్రంథుల నుంచి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచే గుణాలూ ఈ గింజల్లో ఉన్నాయి. ఈ పొడి అతి దాహాన్నీ తగ్గిస్తుంది.
 
కాబట్టి నేరేడు పండ్లు తిని గింజల్ని పారేయకండి. ఎండబెట్టి పొడి చేసి వాడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు 
 
ఇక నేరేడు పండు మంచి మౌత్‌ ఫ్రెష్‌నర్‌‌గా పనిచేస్తుంది. చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. ఇందులో వుండే ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడటం ద్వారా కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.

అన్నీ చూడండి

ఇరాన్‌తో ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదు : నెతన్యాహూ - ట్రంప్ మధ్య వాగ్వాదం

AI ప్రమాదకరంగా మారుతుందా? బస్సులో మైకేల్ జాక్సన్, మనల్ని కూడా...వీడియో

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం

జైలు స్నేహం: ఇండోర్‌లో హనీట్రాప్ ఘటన.. వెలుగులోకి దోపిడీ ముఠా బాగోతం

కంటైనర్‌లో మంటలు.. ఎనిమిది కొత్త కార్లు ధ్వంసం.. డ్రైవర్, క్లీనర్ ఎస్కేప్

అన్నీ చూడండి

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

తర్వాతి కథనం
Show comments