ఉబ్బసం వ్యాధి తగ్గేందుకు పసుపుతో చిట్కా వైద్యం, ఎలాగంటే?

మంగళవారం, 20 డిశెంబరు 2022 (15:13 IST)
గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపుపొడి, కొంచెం మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని వేడి చేసి ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగడం వల్ల జలుబు, తుమ్మలు దగ్గు లాంటివి నివారింపబడతాయి. 
 
పసుపు, ఉసిరిక చూర్ణం ఈ రెండింటిని రెండు గ్రాముల చొప్పున తీసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. 
 
ఇస్నోఫీలియా వ్యాధిలో పసుపు గుణం అపారం. అరచెంచా పసుపులో మూడు చెంచాల స్వచ్చమైన తేనె వేసి రోజుకి మూడు సార్లు చొప్పున నాలుగు నెలల పాటు తీసుకుంటే ఆ వ్యాధి తగ్గు ముఖం పడుతుంది.
 
ముక్కలుగా కొట్టిన పసుపుకొమ్ములు, గోధుమలు సమంగా తీసుకుని దోరగా వేయించి దంచిన చూర్ణాన్ని జల్లించి ఉంచుకుని, రోజూ మూడుపూటలా ఆహారానికి ఆరగంట ముందు పావుస్పూను పొడిని అరగ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి తాగడం వల్ల ఉబ్బసం వ్యాధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా తుమ్ములు, జలుబు తగ్గుతాయి.

అన్నీ చూడండి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి : సీఎం చంద్రబాబు

నేను దోషిని కాదు, అందుకే చనిపోతున్నా: నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న హరికృష్ణ సెల్ఫీ వీడియో

వివాహితను వేధిస్తున్నాడనీ వ్యక్తిని చంపేశారు.. ఎక్కడ?

స్కూటీపై పిల్లాడ్ని వదిలేసిన తల్లి, రయ్యమంటూ వెళ్లాడు, వీడియో

అన్నీ చూడండి

Anna Lezhneva: పవన్ సొంత ఖర్చులే; డాక్టర్లకు కృతజ్ఞతలు:తెలిపిన అనా లెజినోవా

యూనియన్ బ్యాంకు చర్యలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన బండ్ల గణేశ్

అంత:పురం తర్వాత వదలా చిత్రం బెస్ట్ ఫిల్మ్. గ్లింప్స్ : తమ్మారెడ్డి భరద్వాజ్

ఎట్టకేలకు ఈ నెల 23వ తేదీన 'జన నాయగన్' మూవీ రిలీజ్

Sandeep Reddy Vanga: సుమంత్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా చిత్రం రోమాంచకం సిద్దం

తర్వాతి కథనం
Show comments