తిరుమలలో భక్తుల ధర్నా.. ఈవో జోక్యంతో క్యూలైన్లలోకి అనుమతి

బుధవారం, 31 డిశెంబరు 2014 (11:09 IST)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా క్యూ లైన్లలోకి తమను అనుమతించలేదని శ్రీవారి భక్తులు తిరుమలలో ఆందోళనకు దిగారు. ధర్నా చేపట్టారు. వెంటనే తమను అనుమంతించాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ బుధవారం ఉదయం మండిపడ్డారు. అళ్వార్ ట్యాంకు సమీపంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
వైకుంఠ ఏకాదశి కారణంగా భక్తులు తిరుమలకు ముందుగానే చేరుకుంటారు. అదే విధంగా ఈ ఏడాది కూడా బుధవారం ఉదయం నుంచి తిరుమల చేరుకున్నారు. వీరు సహజంగా క్యూలైన్లలో వేచి ఉండి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటారు. తమను క్యూలైన్లోకి అనుమతించాలని కొందరు భక్తుల టిబిసి 122 వద్ద ఉన్న క్యూలైను ప్రవేశ ద్వారం వద్దనున్న వారిని అడిగారు. 
 
లోనికి అనుమతించడానికి వారు నిరాకరించడంతో శ్రీవారి భక్తులు, గోవింద మాలలో ఉన్న భక్తులు అక్కడే రోడ్డుపై బైటాయించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను వెంటనే క్యూలైన్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. చివరకు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. క్యూలైన్లలోకి అనుమతించారు. 

అన్నీ చూడండి

పెళ్లి ఊరేగింపుపై సాయుధ దుండగుల దాడి.. వధువు బంగాలు నగలు లూటీ

జూన్ 30, 2026 మంగళవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

స్వరితం 2026 శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

సీఎం విజయ్ బాటలో సూర్య రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుంది?

హైదరాబాదులో వర్షాలు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు

అన్నీ చూడండి

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

Show comments