సారూ... మీరు చెప్పి మూడు రోజుల కూడా కాలేదు.. అప్పుడే లడ్డూల కొరత

సోమవారం, 14 సెప్టెంబరు 2015 (08:17 IST)
లడ్డూలకు ఎటువంటి కొరత లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు చెప్పి మూడు రోజులు కూడా కాలేదు. తిరుమలలో లడ్డూల కొరత ఏర్పడింది. ఆరు లక్షల లడ్డూలు నిల్వ ఉంచుతున్నామని ఆయన వెల్లడించారు. అయితే సాధారణంగా ఇచ్చే లడ్డూలలోనే కోత విధించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుమలలో ఆదివారం చాలా మంది భక్తులకు లడ్డూలు లభించలేదు. అదనపు లడ్డూలు లేక వెనుదిరగాల్సి పరిస్థితి ఏర్పడింది. ఎటువంటి సిఫారసు లేకుండానే ఆలయం వెలుపల రోజూ 25 వేల అదనపు లడ్డూలు కేటాయించేవారు. వీటిని ప్రత్యేక క్యూలైన్ల ద్వారా విక్రయిస్తారు. అయితే ఆదివారం కేవలం 15 వేల లడ్డూలు మాత్రమే కేటాయించారు. 
 
అంతకు మునుపు లక్ష లడ్డూలు ఇచ్చేవారు. దానిని క్రమంగా 50 వేలకు, తర్వాత 25వేలకు తగ్గించేశారు. ఆదివారం ఆ 25లలో కూడా కోత విధించారు. కేవలం 15 వేలు మాత్రమే కేటాయించారు. దీంతో అదనపు లడ్డూలు కావాలనుకున్న వారికి తిప్పలు తప్పలేదు.  లడ్డూలు దొరకకుండానే వెనుదిరిగారు.  బ్రహ్మోత్సవాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు నిల్వ ఉంచడంతో భాగంగా అదనపను లడ్డూలకు కోత విధించినట్లు తెలుస్తోంది. 

అన్నీ చూడండి

రాష్ట్రంలో ప్రతిరోజూ 7,200 టన్నుల చెత్త: చెత్త శుద్ధి ప్లాంట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

హ్యాక్ టు ది ఫ్యూచర్‌లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అన్నీ చూడండి

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

Show comments