ఒకరికి వంద మంది... నో చెప్పిన టీటీడీ ఈవో

శనివారం, 2 మే 2015 (15:57 IST)
తిరుమలకు అప్పుడే విఐపిల తాకిడి ఆరంభమైంది. శనివారం పాలకమండలి కొలువుదీరుతున్న సందర్భంగా అధిక సంఖ్యలో బంధు మిత్రులను తీసుకురావడానికి పాలక మండలి సభ్యలు ప్రయత్నాలు చేశారు. ప్రమాణస్వీకారం పేరుతో గుంపులు గుంపులుగా దర్శనం కల్పించాలని కోరారు అయితే అందుకు టిటిడి ఈవో వీలు కాదని చెప్పడంతో సభ్యులు వెనక్కి తగ్గారు. వివరాలిలా ఉన్నాయి.
 
ఇటీవల ప్రభుత్వం పాలకమండలిని నియమించింది. ఈ పాలకమండలికి అధ్యక్షుడుగా మాజీ మంత్రి చదలవాడ క్రిష్ణ మూర్తి నియమితులయ్యారు. ఆయనతోపాటు మరో 18 మంది సభ్యులుగా నియమితులయ్యారు. వారిలో 13 మంది శనివారం ఉదయం 11.15 గంటలకు ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రతిష్టాత్మక ఆలయ పాలకమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో బీరకాయ పీచు బంధువులు కూడా సభ్యుల వెంట పడ్డారు. 
 
దీంతో ఒకరిద్దరు సభ్యులు వందకుపై పాసులను కోరినట్లు సమాచారం. ఈ సంఖ్యను చూసి అధికారులు బెదిరిపోయారు. అసలే శనివారం ఆపై పగటి పూట క్యూలైన్ నిలిపేసి ప్రమాణస్వీకారం పేరుతో దర్శనం కల్పించడం సాధ్యం కాదని ఈవో దొండపాటి సాంబశివరావు తేల్చి చెప్పారు. దీని వలన సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని అంతమందికి అనుమతి కలిగించడం సాధ్యం కాదని చెప్పడంతో సభ్యులు తమ వెంట తెచ్చుకునే వారి సంఖ్యను తగ్గించుకోవాల్సి వచ్చింది. దీంతో 25 మందికి లోపునే ఒక్కొక్క సభ్యుడు తమ బంధుగణాన్ని లోని తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. 
 

అన్నీ చూడండి

మా అల్లుడు ఓ సైకో, భార్య బ్యాగులో ట్రాకర్ పెట్టేవాడు: రాధా గాయత్రి తల్లి ఆవేదన

బ్యాంక్ లాకర్‌లో రూ. 1.50 కోట్ల నగదు.. ఏసీబీ చిక్కిన నరహరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

నీట్ యూజీ- 2026.. అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ వేసిన ఎన్టీఏ.. విద్యార్థి షాక్

క్రైస్తవ ప్రార్థనా కేంద్రంలో దోపిడీ, వేధింపులు.. 17ఏళ్ల బాలుడిపై దాడి

ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డుగా వున్నాడని రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి

అన్నీ చూడండి

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?

కేవలం రూ.120 ఖర్చుతో శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు..

Show comments